Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు జగన్‌ అన్యాయం..దేవినేని ఉమ

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (09:14 IST)
సీఎం జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పోలవరాన్ని ఆపి… రైతులకు అన్యాయం చేశారన్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఈఎన్సీ వెంకటేశ్వరరావును తప్పించడం అన్యాయమని తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌తో వ్యయం పెంచి దోచిపెట్టడం తప్ప… చేసేదేం లేదని వ్యాఖ్యానించారు.

కాంట్రాక్ట్‌ మార్చుతూ పోతే డ్యామ్‌ భద్రతకు బాధ్యత ఎవరిది? అని అడిగారు. చంద్రబాబు పేరు కన్పించకుండా చేయాలన్నదే జగన్‌ అక్కసు అని చెప్పారు. "వైసీపీ నేతల దుశ్చర్యలతో 70 ఏళ్ళ రాజ్యాంగం, 73 ఏళ్ళ స్వాతంత్య్రం పరిహాసం పాలయ్యాయి.

రక్తం చిమ్మి, ఎముకలు జల్లి యజ్ఞాలను భగ్నం చేయడం పురాణాల్లో విన్నాం. అంతకు మించిన రాక్షస కృత్యాలను ఇప్పుడే చూస్తున్నాం. దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా నివసించే హక్కుంది. ప్రాణాలు, ఆస్తులు కాపాడుకునే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది.

అలాంటిది వైసీపీ వాళ్ల బెదిరింపులతో సొంత ఊళ్లు వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవాలా? నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా? ఆత్మగౌరవంతో జీవించే హక్కును కాలరాస్తారా? పంట పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటారా? రోడ్లకు అడ్డంగా గోడలు కడతారా? అయిదారేళ్లు కష్టపడి పెంచిన చీని చెట్లను నరికేస్తారా?

పాడి గేదెలకు విషం పెట్టి చంపుతారా? ఎస్సీలు, ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడతారా? బోర్లు పూడ్చేయడం, పైపులు కోయడం..ఇవన్నీ రైతు కష్టం తెలిసినవాళ్లు చేసే పనులేనా? మానవత్వం ఉన్నవారంతా ఈ అరాచకాలను ఖండించాలి. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడాలి" అని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments