Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మార్చే హక్కు జగన్‌కి లేదు: సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (08:36 IST)
బీసీజీ కమిటీపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోస్టన్ రిపోర్ట్‌లో బీసీజీ సభ్యుల సంతకాలు మాత్రమే ఉంటాయని, సీఎం జగన్ చెప్తే ఎంపీ విజయసాయిరెడ్డి రిపోర్ట్ రాశారని ఆరోపించారు. రాజధాని మార్చే రాజకీయ హక్కు జగన్‌కి లేదని చెప్పారు.

ప్రభుత్వం సమాధులు సిద్ధం చేసింది.. రైతులకా? ప్రభుత్వానికా త్వరలో తెలుస్తుందని నారాయణ హెచ్చరించారు. అసెంబ్లీ, సచివాలయం ఒక దగ్గరే ఉండాలని, మొగుడు ఒక చోట.. పెళ్ళాం ఒక చోట ఉండొద్దని సూచించారు.

ఇక నుంచి ప్రతి శుక్రవారం జగన్‌ కోర్టుకెళ్లాల్సిందేనని, పాలన ఎలా చేస్తారని ప్రశ్నించారు. మందడంలో మహిళలపై దాడులు దారుణం పోలీసులా.. డెకాయిట్లా అని నారాయణ నిలదీశారు.
 
రాజధాని అమరావతిపై బీసీజీ తుది నివేదికను జగన్‌ మోహన్‌రెడ్డికి అందజేసిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌ను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికను అందజేశారు. రాజధాని, అభివృద్ధిపై సీఎంకు బీసీజీ ప్రతినిధుల నివేదిక అందించారు.

రాజధానిపై ఇప్పటికే జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 6న రెండు నివేదికలనూ హైపవర్‌ కమిటీ పరిశీలించనుంది. అనంతరం 8న రెండు నివేదికలపై కేబినెట్‌ చర్చించనున్నది. హైపవర్‌ కమిటీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సారథ్యాన ఈ నెల 6వ తేదీన తొలిసారిగా సమావేశం కానుంది. ఈ కమిటీ 3 వారాల్లో తన తన సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments