Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ భూముల అమ్మకాలపై జగన్ బ్రేకులు, ప్రక్రియ నిలిపివేత

Webdunia
సోమవారం, 25 మే 2020 (21:24 IST)
టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గింది. టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

2016, జనవరి 30న టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత పాలకమండలి నిర్ణయాన్ని నిలిపివేస్తూ జీవో నెంబర్‌ 888 విడుదల చేశారు.

భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయంపై టీటీడీ పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించింది.

ఆధ్యాత్మికవేత్తలు, ధర్మప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వులో ప్రభుత్వం టీటీడీకి సూచించింది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకూ భూముల వేలం నిలిపివేయాలని నిర్ణయించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments