Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ అక్రమాస్తుల కేసు : ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌కు ఆదేశం... కష్టాలు తప్పవా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (11:30 IST)
వైకాపా అధినేత, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా, శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. అలాగే, ఏ2గా ఉన్న వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావులు కూడా హాజరయ్యారు. 
 
అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా నాంపల్లి సీబీఐ కోర్టు జగన్మోహన్ రెడ్డికి తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసు విచారణను ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌కు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో కేసులోని నిందితులతో వారి తరపు న్యాయవాదులు కూడా ఒకింత షాక్‌కు గురయ్యారు.
 
నిజానికి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కేవలం కొన్ని రకాల కేసులకు మాత్రమే అనుమతిస్తారు. అత్యాచారానికి సంబంధించిన కేసులు, దేశ భద్రతకు, రాజ్యాంగానికి సంబంధించిన కేసులను మాత్రమే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌కు అనుమతిస్తారు. 
 
అయితే, జగన్ అక్రమాస్తుల కేసులో అత్యంత కీలకం కావడంతో పాటు ప్రజాప్రయోజనాలకు, అక్రమ ఆదాయాల, కోట్లాది రూపాయల ఆర్థిక ప్రయోజనాలు, భిన్న కంపెనీల లావాదేవీలు తదితర అంశాలతో ముడిపడివుండటం వల్లే న్యాయమూర్తి ఈ తరహా ప్రొసీడింగ్స్‌కు ఆదేశించివుంటారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments