జగన్‌ అక్రమాస్తుల కేసు : ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌కు ఆదేశం... కష్టాలు తప్పవా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (11:30 IST)
వైకాపా అధినేత, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా, శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. అలాగే, ఏ2గా ఉన్న వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావులు కూడా హాజరయ్యారు. 
 
అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా నాంపల్లి సీబీఐ కోర్టు జగన్మోహన్ రెడ్డికి తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసు విచారణను ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌కు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో కేసులోని నిందితులతో వారి తరపు న్యాయవాదులు కూడా ఒకింత షాక్‌కు గురయ్యారు.
 
నిజానికి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కేవలం కొన్ని రకాల కేసులకు మాత్రమే అనుమతిస్తారు. అత్యాచారానికి సంబంధించిన కేసులు, దేశ భద్రతకు, రాజ్యాంగానికి సంబంధించిన కేసులను మాత్రమే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌కు అనుమతిస్తారు. 
 
అయితే, జగన్ అక్రమాస్తుల కేసులో అత్యంత కీలకం కావడంతో పాటు ప్రజాప్రయోజనాలకు, అక్రమ ఆదాయాల, కోట్లాది రూపాయల ఆర్థిక ప్రయోజనాలు, భిన్న కంపెనీల లావాదేవీలు తదితర అంశాలతో ముడిపడివుండటం వల్లే న్యాయమూర్తి ఈ తరహా ప్రొసీడింగ్స్‌కు ఆదేశించివుంటారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments