Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని ప్రాంత ప్రజలు చేసే సన్మానం కళ్లారా చూడాలనివుంది...

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (11:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులకు జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు ఓ సలహా ఇచ్చారు. ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడటం కాదనీ, దమ్మూధైర్యం ఉంటే ప్రజల మధ్యకెళ్లి మాట్లాడాలని కోరారు. అపుడు ప్రజలు చేసే సన్మానాన్ని కళ్లారా చూడాలని ఉంది అన్నారు. 
 
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత 24 రోజులుగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళనలపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. అయితే, వైకాపా ప్రజాప్రతినిధులు మాత్రం రాజధాని రైతుల ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యానిస్తున్నారు. 
 
వీటిపై నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. కామెంట్ చేసే ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతానికి వెళ్లి మాట్లాడితే, అప్పుడు అక్కడి ప్రజలు చేసే సన్మానాన్ని తాను చూడాలని అనుకుంటున్నానని అన్నారు. "రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మీ రూమ్స్‌లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే, వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది" అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments