Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కటౌట్‌కు నిప్పు...

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (13:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. అనేక ప్రాంతాల్లో వైకాపా ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కటౌట్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్థరాత్రి సమయంలో ఈ పనికి పాల్పడ్డారు. దీంతో ముఖ్యమంత్రి కటౌట్ సగం మేరకు కాలిపోయింది. 
 
మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ కటౌట్‌ను వైకాపా శ్రేణులు ఏర్పాటు చేశారు. కటౌన్‌ను దగ్ధం చేయడంపై వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
మరోవైపు, ఈ కటౌట్ దగ్ధం వార్త తెలుసుకున్న బందరు డీఎస్పీ బాషా, పెడన సీఐ ప్రసన్న గౌడ, గూడూరు ఎస్ఐ వెంకట్ ఘనటా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెడనలో చేనేత కార్మికులకు చేయూత పథకాన్ని ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా జగన్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆర్థిక సంఘం డైరెక్టర్ కారుమంచి కామేశ్వర రావు మాట్లాడుతూ, జగన్ కటౌట్‌ను కాల్చివేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రాజకీయాల్లో అనేక కొడవలు ఉంటాయని, కానీ కటౌట్లకు నిప్పు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments