Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఐటీ సోదాలు... కాంగ్రెస్ - వైకాపా నేతల్లో గుబులు!

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (15:33 IST)
ఏపీలోని తిరుపతి పట్టణంలో ఆదాయపన్ను శాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా సోదాలకు దిగారు. తిరుపతి పట్టణంలోని డాలర్స్ గ్రూప్‌నకు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సంస్థ ఛైర్మన్ దివాకర్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, ఇళ్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నాయన్న పక్కా సమాచారంతో ఐటీ అధికారులు ఈ తనిఖీలకు దిగారు. 
 
కాగా, తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు, వారి బంధువుల ఇళ్లలో కూడా గురువారం ఈ ఐటీ సోదాలు జరిగిన విషయం తెల్సిందే. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కె.జానారెడ్డి, ఆయన కుమారుడు జయవీర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. అయితే, సాధారణ తనిఖీల్లో భాగంగానే వీరి ఇళ్ళలో సోదాలు చేపట్టినట్టు కొన్ని పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. 
 
అలాగే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కె.లక్ష్మారెడ్డికి చెందిన గృహాలు, విల్లాలు, ఫామ్‌హౌస్‌లు, బాలాపూర్‌లోని బడంగ్ పేట్ మేయర్, పీసీసీ నేత, చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్ళలో ఐటీ అధికారులు గురువారం తనిఖీలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments