Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఐటీ సోదాలు... కాంగ్రెస్ - వైకాపా నేతల్లో గుబులు!

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (15:33 IST)
ఏపీలోని తిరుపతి పట్టణంలో ఆదాయపన్ను శాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా సోదాలకు దిగారు. తిరుపతి పట్టణంలోని డాలర్స్ గ్రూప్‌నకు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సంస్థ ఛైర్మన్ దివాకర్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, ఇళ్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నాయన్న పక్కా సమాచారంతో ఐటీ అధికారులు ఈ తనిఖీలకు దిగారు. 
 
కాగా, తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు, వారి బంధువుల ఇళ్లలో కూడా గురువారం ఈ ఐటీ సోదాలు జరిగిన విషయం తెల్సిందే. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కె.జానారెడ్డి, ఆయన కుమారుడు జయవీర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. అయితే, సాధారణ తనిఖీల్లో భాగంగానే వీరి ఇళ్ళలో సోదాలు చేపట్టినట్టు కొన్ని పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. 
 
అలాగే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కె.లక్ష్మారెడ్డికి చెందిన గృహాలు, విల్లాలు, ఫామ్‌హౌస్‌లు, బాలాపూర్‌లోని బడంగ్ పేట్ మేయర్, పీసీసీ నేత, చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్ళలో ఐటీ అధికారులు గురువారం తనిఖీలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments