రోజా ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో?

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (16:43 IST)
రోజురోజుకు సొంత నియోజకవర్గంలో శత్రువులను పెంచేసుకుంటున్నారు రోజా. ఈ మాటలు ఎవరో చెప్పడం లేదు. సాక్షాత్తు ఆమెతో కలిసే తిరిగే వాళ్ళే చెబుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాను స్థానికురాలు కాకపోయినా గెలిపించింది స్థానిక నాయకులే. కలిసికట్టుగా ఉన్న నాయకులందరూ ఇప్పుడు విడిపోయారు. రోజాను దూరంగా పెట్టారు.

 
కేవలం పార్టీకే పనిచేస్తాము. రోజాతో కలిసి పనిచేయమని స్పష్టం  చేశారు. అంతేకాదు రోజాకు ఈసారి టిక్కెట్లు ఇవ్వకూడదంటున్నారు. తమలో ఒకరు.. అంటే స్థానికంగా ఉన్నవారిరే టిక్కెట్టు ఇవ్వాలంటున్నారు. 

 
రోజాకు ప్రధానంగా నగరి, పుత్తూరు, విజయపురం, వడమాలపేట మండలాలకు చెందిన నేతలతోనే సమస్యంతా. త్వరలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. మరో సంవత్సరంలో ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 
ఇలాంటి సమయంలో రోజా శత్రువులను దగ్గర చేర్చుకోవాలనుకుంటున్నారట. తనను వ్యతిరేకిస్తున్న వారిని ఒక్కొక్కరికీ దగ్గరకు చేర్చుకుని వ్యతిరేకులు అన్న మాటే లేకుండా చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి పావులు కూడా కదుపుతున్నారట. 

 
తనను వ్యతిరేకిస్తున్న వారికి సన్నిహితంగా ఉండే వారిని దగ్గరకు చేర్చుకుని తాను ఎందుకు వారిని దూరం పెట్టాల్సి వచ్చిందోనన్న విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పి వారి ద్వారా తన వ్యతిరేకులకు చెప్పించి ఆ తరువాత తానే స్వయంగా మాట్లాడుకుంటున్నారట రోజా. మరి చూడాలి రోజా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందన్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments