Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయవారధిగా మారుతున్న గరుడ వారధి..?

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:52 IST)
తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న గరుడ వారధి పనులు కాస్త రాజకీయవారధిగా మారిపోతుంది. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పేరును మార్చేందుకు అధికార పార్టీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఏకంగా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం కూడా చేశారు.
 
అసలు ఉన్నట్లుండి గరుడ వారధి పేరును ఎందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తిరుపతి కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ సభ్యుడు బహిష్కరించాడు. దీంతో 48 మంది వైసిపి కార్పొరేటర్లు ఆ పేరు మార్పును ఆమోదించేశారు.
 
గరుడ పేరు ఎంతో ప్రాముఖ్యమైనది. స్వామివారికి ఎంతో ఇష్టమైన వాహనంగా గరుత్మంతుడు. ఆ పేరు మీద వారధి నిర్మిస్తుంటే ఎలా ప్రభుత్వం  మారుస్తోందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షాలు.
 
కక్షపూరితంగా వ్యవహరిస్తూ టిడిపి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు పేరు మార్చే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం కచ్చితంగా పేరు మార్చాలని నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంమీద గరుడ వారధి కాస్త రాజకీయ వారధిగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments