Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయవారధిగా మారుతున్న గరుడ వారధి..?

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:52 IST)
తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న గరుడ వారధి పనులు కాస్త రాజకీయవారధిగా మారిపోతుంది. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పేరును మార్చేందుకు అధికార పార్టీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఏకంగా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం కూడా చేశారు.
 
అసలు ఉన్నట్లుండి గరుడ వారధి పేరును ఎందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తిరుపతి కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ సభ్యుడు బహిష్కరించాడు. దీంతో 48 మంది వైసిపి కార్పొరేటర్లు ఆ పేరు మార్పును ఆమోదించేశారు.
 
గరుడ పేరు ఎంతో ప్రాముఖ్యమైనది. స్వామివారికి ఎంతో ఇష్టమైన వాహనంగా గరుత్మంతుడు. ఆ పేరు మీద వారధి నిర్మిస్తుంటే ఎలా ప్రభుత్వం  మారుస్తోందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షాలు.
 
కక్షపూరితంగా వ్యవహరిస్తూ టిడిపి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు పేరు మార్చే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం కచ్చితంగా పేరు మార్చాలని నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంమీద గరుడ వారధి కాస్త రాజకీయ వారధిగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments