Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘నాకు నేనే చనిపోతున్నా... అమ్మానాన్న మీరు బాగుండాలి’... విద్యార్థిని సూసైడ్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాకు నేనే చనిపోతున్నా.. అమ్మానాన్నా మీరు బాగుండాలి అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (17:29 IST)
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాకు నేనే చనిపోతున్నా.. అమ్మానాన్నా మీరు బాగుండాలి అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హుజూరాబాద్, సైదాపూర్‌ మండలం రాములపల్లి గ్రామానికి చెందిన చందన పట్టణంలోని ఒక ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో పోతరాజు చందన (19) అనే యువతి ఇంటర్మీడియేట్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్లిన చందన... క్లాసులు జరుగుతుండగా మధ్యలోనే బయటకు వచ్చి బిల్డింగ్‌పైన గల స్టోరూంకు వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
దీన్ని కళాశాల యజమాన్యం హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ కోటేశ్వర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. చందన మృతదేహం వద్ద ‘నాకు నేనే చనిపోతున్నా... అమ్మానాన్న మీరు బాగుండాలి’ అని రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసులకు లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments