Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు జరిగితీరుతాయ్ అంతే.. మంత్రి

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (10:14 IST)
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామన్నదానిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. 
 
అలాగే జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు. తేదీలను కూడా అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నామని.. విద్యాశాఖ అధికారులు సైతం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఉపాధ్యాయులతో కూడా చర్చించడం జరిగిందన్నారు. అయితే సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల తేదీ, ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
 
ప్రస్తుతం ఏపీలో భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది అన్నారు. సిబ్బంది సైతం అంతా సిద్ధంగానే ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. అన్ని అనుకున్నట్టు కుదిరితే వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి సురేశ్‌ తెలిపారు. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు.
 
 విద్యార్థుల ప్రయోజనం కోసమే... కరోనా సవాళ్ల మధ్య కూడా పరీక్షలు నిర్వహస్తున్నామని వివరణ ఇచ్చారు. అలాగే 1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. 36 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments