Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు జరిగితీరుతాయ్ అంతే.. మంత్రి

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (10:14 IST)
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామన్నదానిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. 
 
అలాగే జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు. తేదీలను కూడా అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నామని.. విద్యాశాఖ అధికారులు సైతం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఉపాధ్యాయులతో కూడా చర్చించడం జరిగిందన్నారు. అయితే సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల తేదీ, ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
 
ప్రస్తుతం ఏపీలో భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది అన్నారు. సిబ్బంది సైతం అంతా సిద్ధంగానే ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. అన్ని అనుకున్నట్టు కుదిరితే వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి సురేశ్‌ తెలిపారు. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు.
 
 విద్యార్థుల ప్రయోజనం కోసమే... కరోనా సవాళ్ల మధ్య కూడా పరీక్షలు నిర్వహస్తున్నామని వివరణ ఇచ్చారు. అలాగే 1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. 36 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments