Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ విధానాలతో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (05:50 IST)
వైసీపీ పాలనలో రాష్ట్ర ఆదాయం 17 శాతం తగ్గిందని టీడీపీ పోలిట్​బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ఆరోపించారు. జగన్​ సర్కారు వైఫల్యం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని అన్నారు.

పోలవరం, పీపీఏలు వంటి విషయాల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని టీడీపీ పోలిట్​బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. అమరావతిలో జరిగిన పోలిట్​బ్యూరో సమావేశం వివరాలు వెల్లడించిన ఆయన... ప్రధానంగా పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించినట్లు వివరించారు.

గత ఐదు నెలల్లో రాష్ట్ర ఆదాయం 17 శాతం తగ్గిందని అన్నారు. కియా కార్ల పరిశ్రమను స్థానిక ఎంపీ బెదిరించారని ఆరోపించారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నీటి పంపకాలపై రాష్ట్రాల మధ్య వివాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఎగువ రాష్ట్రాల ఒక్క టీఎంసీ ఇచ్చేందుకూ ఒప్పుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్​, కేసీఆర్​ స్నేహం వారి వ్యక్తిగతమన్న ఆయన ఏపీ జలాలు తెలంగాణ భూముల్లోకి పంపడంపై పునరాలోచించాలని సూచించారు. పోలవరం, పీపీఏలు ఇలా అన్నింటిలో కేంద్రంతో ఘర్షణ వైఖరి నెలకొందని ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments