Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు శుభవార్త... ప్రత్యేకించి మహిళలకు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (11:35 IST)
భారత రైల్వే శాఖ ప్రయాణికులకు మరో శుభవార్త తెలియజేసింది. ప్రత్యేకించి మహిళల కోసం కొత్త వెసులుబాటు తీసుకువచ్చింది. మహిళా ప్రయాణికుల భద్రతలో భాగంగా వారి కోసం ప్రత్యేక కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మహిళలకు ఏర్పాటు చేసే ప్రత్యేకమైన బోగీలు పింక్ రంగులో ఉంటాయి. 
 
బోగీలపై పింక్ కలర్ లైన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో ప్రతి ట్రైన్‌లో ఒక కోచ్ మహిళల కోసం కేటాయించిన విషయం తెలిసిందే. మహిళల కోసం కేటాయించిన పింక్ బోగీల్లో ఆడవారు. చిన్న పిల్లలు ఎక్కొచ్చు. నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ జోన్ ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తోంది. 
 
ఎన్ఎఫ్ఆర్ దాదాపు ఆరు ప్యాసింజరర్ ట్రైన్స్ ఎల్ఎల్ఆర్ కోచ్‌లకు పింక్ రంగు వేసింది. ఈ బోగీల్లో కేవలం మహిళలు, పిల్లలు మాత్రమే ప్రయాణించాలనే నిబంధనను పెట్టారు. ఈ విషయంలో ఇండియన్ రైల్వే... మెట్రోని ఫాలో అవుతోంది.
 
 'మహిళా ప్రయాణికుల భద్రత కోసం మెట్రో దారిలోనే నడుస్తాం. వారికి ప్రత్యేకమైన బోగీలను ఎక్కువగా ఏర్పాటు చేస్తాం. వీరిలో మహిళలు, పిల్లలు మాత్రమే ప్రయాణించొచ్చు. ఎన్ఎఫ్ఆర్ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తోంది. త్వరలోనే ఇతర ట్రైన్లకు కూడా దీనిని వర్తింపజేస్తాం' అని రైల్వే శాఖ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments