నిన్న అమెరికా.. నేడు న్యూజిలాండ్ : దేశం వదిలి వెళ్లాలంటూ సిక్కు యువకుడికి వార్నింగ్

అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో నివశించే భారతీయులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చిచంపారు. ఆ తర్వాత గుజరాతీ వ్యాపారిపై కాల

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (09:59 IST)
అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో నివశించే భారతీయులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చిచంపారు. ఆ తర్వాత గుజరాతీ వ్యాపారిపై కాల్పులు జరిపారు. నిన్నటికి నిన్న వరంగల్‌కు చెందిన జ్యోతి అనే యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. దీంతో అమెరికాలోని భారతీయులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు.
 
ఈ పరిస్థితి న్యూజిలాండ్ వంతు వచ్చింది. ఆక్లాండ్‌లో ఓ సిక్కు యువకుడిపై స్థానికుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. నరీందర్వీర్ సింగ్ అనే యువకుడు, తన కారును పార్కింగ్ నుంచి తీస్తుండగా, ఓ జంట మరో వాహనంలో వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. 
 
కారు నడుపుతున్న వ్యక్తి నరీందర్వీర్‌ను తమ దేశం విడిచి వెళ్లాలని బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించినట్టు సమాచారం. వారు వెళ్లిపోయేటప్పుడు తాను పక్కకు తప్పుకున్నానని, కారులోని యువతి తనవైపుకు వేలు చూపించగా, అతను తిట్ల దండకానికి దిగాడని, చాలా అవమానకరంగా మాట్లాడాడని బాధితుడు వాపోయాడు. 
 
ఈ ఘటనను తాను వీడియో తీయగా, అతను మరింత రెచ్చిపోయాడని చెప్పాడు. అలాగే, మరో ఘటనలో విక్రమ్ జిత్ సింగ్ అనే వ్యక్తిపై స్థానికుడు అసభ్యంగా మాట్లాడుతూ, స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని బెదిరించినట్టు తెలుస్తోంది. తాజా ఘటనలతో న్యూజిలాండ్ లోని ఇండియన్ కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments