Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రేపు వర్షాలు.. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దు...

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (10:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మగళ, బుధవారాల్లో వర్షాలు కురుస్తాయని, అందువల్ల జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా, కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భలపై ఉన్న వాయుగుండం సోమవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. ఇది మరికొద్ది గంటల్లో మధ్యప్రదేశ్ మీదుగా వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీలోని వివత్తుల నిర్వహణా సంస్థ తెలిపింది. 
 
ఇక మంగళవారం తీరంవెంబడి గంటకు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల 18వ తేదీన బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉంటుందో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments