Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వైకాపాదే గెలుపు.. ఇండియా టీవీ పోల్

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (05:19 IST)
ఏపీలో వైకాపాదే గెలుపు అని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ ఒపీనియల్ పోల్ అంచనా వేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో మొత్తం వైకాపా, టీడీపీ మధ్యనే పోటీ వుండవచ్చునని పోల్ అంచనా వేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లకు గాను వైసీపీ 22, టీడీపీ 3 స్థానాల్లో గెలిచాయి. 
 
కానీ ఈసారి వైసీపీ 7 సీట్లు కోల్పోవచ్చునని... అవి టీడీపీ ఖాతాలో పడే అవకాశముందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. అలాగే తెలంగాణ సహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చునని సర్వేలో తేలింది. 
 
కానీ ఏపీలో మాత్రం ఈ జాతీయ పార్టీలు... రెండూ ఒక్క సీటూ గెలుచుకునే అవకాశాలు లేవని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ఇంకా జాతీయంగా దక్షిణ భారతదేశంలో 132 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 38, ఇండియా కూటమి 60, ఇతరులు 32 గెలుచుకోవచ్చునని ఈ సర్వే అంచనా వేసింది. అలాగే కర్ణాటక లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను బీజేపీ దక్కించుకోగలుగుతుంది. 
 
కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్- 11, వామపక్షాలకు చెందిన ఎల్డీఎఫ్- 6, బీజేపీ- 3 చోట్ల గెలుస్తాయి. తమిళనాడులో డీఎంకే-20, కాంగ్రెస్-6, బీజేపీ-5, ఏఐఏడీఎంకే-5 స్థానాల్లో విజయం సాధిస్తారని తాజా పోల్‌ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments