Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్యాక్షన్ ముసుగు తొలగించిన జగన్.. అందుకే నెల్లూరులో పోలీసులతో అలజడి : నారా లోకేశ్

Advertiesment
nara lokesh

ఠాగూర్

, సోమవారం, 4 మార్చి 2024 (16:19 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ ముసుగు తొలగించారని, అందుకే నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇళ్లపై పోలీసులతో దాడులు చేయిస్తూ అలజడి సృష్టిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు వైకాపా నేతలు అనేక మంది టీడీపీలో చేరారు. వీరిలో వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో వైకాపా పూర్తిగా పట్టుకోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. పైగా, రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో సీఎం జగన్ ఫ్యాక్షన్ ముసుగు తొలగించారని, ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగిస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. 
 
జగన్ నియంతృత్వ పోకడలకు భరించలేకనే పలువురు వైకాపా నేతలు టీడీపీలో వలస వస్తున్నారని ఆయన అన్నారు. ఈ పరణామాలను జీర్ణించుకోలోని జగన్ తన ఫ్యాక్షన్ రాజకీయాలకు పదును పెడుతున్నారన్నార. అందుకే నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని, విజితా రెడ్డి, పట్టాభిమిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఫైనాన్షియర్ గురబ్రహ్మంలో ఇళ్లకు పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించారని లోకేశ్ ఆరోపించారు. 
 
పోలీసులు జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారని తెలపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రానికి ఈసీ ఒక పరిశీలకుడిని పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని ఆయన కోరారు. జగన్ తొత్తులుగా మారిన కొందరు పోలీసుల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 5న నథింగ్ ఫోన్ 2ఏ.. ఫీచర్స్ ఏంటి.. ధరెంతో తెలుసా?