Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఐ.టి. కలకలం... సక్కు గ్రూపు సంస్థలపై దాడులు..

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (10:30 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రో మాటు ఐ.టి. దాడులు క‌ల‌క‌లం రేపాయి. గుంటూరుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సక్కు గ్రూపు సంస్థలపై ఐటీ దాడులు ఉదయం నుండి కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 23 ఆ సంస్థకు చెందిన కార్యాలయాలు, కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.
 
 
తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రాలలో కోడి గుడ్ల వ్యాపారంలో సక్కు గ్రూప్స్ ఇటీవల కాలంలో మంచి పేరొందింది. దీనితోపాటు మిర్చి ఎగుమ‌తులు, స్పిన్నింగ్ వ్యాపారాల‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఈ వ్యాపార లావాదేవీల‌పై ఐ.టి. అధికారులు చెక్ పెట్టారు. ముఖ్యంగా గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ బ్రాంచ్ లో ఉదయం నుండి దాదాపు 50 మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. ఆఫీసు లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. లోపల ఉన్న వారిని కూడా బయటకి రానివ్వడం లేదు. వారి మొబైల్స్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 
వందల కోట్ల కు సంబంధించిన లావాదేవీలకు సరైన టాక్స్ చెల్లించడం లేదని వచ్చిన సమాచారం మేరకు ఏకకాలంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారు. అయితే, అక్ర‌మ వ్యాపారాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments