Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ మద్యం కేసులో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు.. ఛార్జిషీట్ దాఖలు

నకిలీ మద్యం కేసులో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిపై చార్జిషీట్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పలు ఛార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది. ఆరు కేసుల్లో కావలి ఎమ్మెల్యే

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (12:50 IST)
నకిలీ మద్యం కేసులో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిపై చార్జిషీట్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పలు ఛార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది. ఆరు కేసుల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి, నాలుగు కేసుల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటూ సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 
 
వీరిద్దరిపై ఎపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 34(ఏ), 37(ఏ3), 420, 487, 120బీల కింద వీరిపై అభియోగాలను మోపింది. 2014 ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వీరు భారీ ఎత్తున కల్తీ మద్యం తెచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనే ఈ వ్యవహారం సంచలనం అయింది. ఎక్సైజ్ శాఖకు సుంకం చెల్లించకుండా, హాలోగ్రామ్‌లను మార్చి, లిక్కర్ మాఫియా ద్వారా కల్తీ మద్యాన్ని వీరి అనుచరులు తీసుకొచ్చినట్టు విచారణలో గుర్తించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇది వైకాపాకు తీవ్రషాక్‌కు గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thiruveer : మసూద తర్వాత సెలెక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటున్నా: తిరువీర్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments