Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ నేతలపై అక్రమ కేసులు: చంద్రబాబు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:36 IST)
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలని కోరుతూ.. ఏపీ ఎన్నికల సంఘానికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

లేఖలో.. చిత్తూరు జిల్లా కుప్పంలో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, మిట్టపల్లి గ్రామ పంచాయతీలో వైసిపి అక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థి శివలక్ష్మి భర్త మంజునాథపై అక్రమ కేసు నమోదు చేశారని చెప్పారు.

మరో టిడిపి నాయకుడు మనోహర్‌ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని, కేసులు పెట్టడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉప సంహరించేలా చేయాలని, మనోహర్‌కు ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలని కోరారు. కుప్పంలో కూడా వైసిపి నేతలు గందరగోళం నెలకొల్పుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments