Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ నేతలపై అక్రమ కేసులు: చంద్రబాబు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:36 IST)
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలని కోరుతూ.. ఏపీ ఎన్నికల సంఘానికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

లేఖలో.. చిత్తూరు జిల్లా కుప్పంలో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, మిట్టపల్లి గ్రామ పంచాయతీలో వైసిపి అక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థి శివలక్ష్మి భర్త మంజునాథపై అక్రమ కేసు నమోదు చేశారని చెప్పారు.

మరో టిడిపి నాయకుడు మనోహర్‌ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని, కేసులు పెట్టడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉప సంహరించేలా చేయాలని, మనోహర్‌కు ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలని కోరారు. కుప్పంలో కూడా వైసిపి నేతలు గందరగోళం నెలకొల్పుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments