Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇల్లంతా షేక్ అవుంతోంది.. బహుశా భూకంపం అనుకుంటా.. రాహుల్ గాంధీ (video)

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:17 IST)
Rahul Gandhi
ఉత్తరాదిన శుక్రవారం రాత్రి భూమి కంపించింది. ఇంట్లో వున్నప్పుడు భూమి కంపిస్తే.. అందరూ పరుగులు పెడతారు. కానీ ఇక్కడ సీన్ మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం... తన కూర్చున్న సీట్లోంచీ పైకి కూడా లేవలేదు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తజకిస్థాన్‌లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకంపనలు ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లో వచ్చాయి.
 
భూకంపం వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ చికాగో యూనివర్శిటీ విద్యార్థులతో జూమ్‌లో వర్చువల్ ఇంటరాక్టింగ్ అవుతున్నారు. ఆ సమయంలో ఇల్లంతా షేక్ అవుతోందనీ బహుశా భూకంపం కావచ్చని విద్యార్థులకు ఆయన తెలిపారు. ఒకట్రెండు సెకండ్లపాటూ రాహుల్ ఇల్లు కంపించింది. అయినప్పటికీ భయపడని ఆయన... ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి... వెంటనే విద్యార్థుల విషయాల్లోకి వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
 
నిజానికి ఈ ప్రకంపనలు వచ్చినప్పుడు ఉత్తర భారత్‌లోని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వచ్చినవి ప్రకంపనలే అయినప్పటికీ భూకంపం వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ప్రజలు చాలా భయపడ్డారు. రాహుల్ మాత్రం నవ్వుతూ… ప్రశాంతంగా కూర్చోవడం అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం రాహుల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments