ఇల్లంతా షేక్ అవుంతోంది.. బహుశా భూకంపం అనుకుంటా.. రాహుల్ గాంధీ (video)

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:17 IST)
Rahul Gandhi
ఉత్తరాదిన శుక్రవారం రాత్రి భూమి కంపించింది. ఇంట్లో వున్నప్పుడు భూమి కంపిస్తే.. అందరూ పరుగులు పెడతారు. కానీ ఇక్కడ సీన్ మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం... తన కూర్చున్న సీట్లోంచీ పైకి కూడా లేవలేదు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తజకిస్థాన్‌లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకంపనలు ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లో వచ్చాయి.
 
భూకంపం వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ చికాగో యూనివర్శిటీ విద్యార్థులతో జూమ్‌లో వర్చువల్ ఇంటరాక్టింగ్ అవుతున్నారు. ఆ సమయంలో ఇల్లంతా షేక్ అవుతోందనీ బహుశా భూకంపం కావచ్చని విద్యార్థులకు ఆయన తెలిపారు. ఒకట్రెండు సెకండ్లపాటూ రాహుల్ ఇల్లు కంపించింది. అయినప్పటికీ భయపడని ఆయన... ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి... వెంటనే విద్యార్థుల విషయాల్లోకి వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
 
నిజానికి ఈ ప్రకంపనలు వచ్చినప్పుడు ఉత్తర భారత్‌లోని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వచ్చినవి ప్రకంపనలే అయినప్పటికీ భూకంపం వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ప్రజలు చాలా భయపడ్డారు. రాహుల్ మాత్రం నవ్వుతూ… ప్రశాంతంగా కూర్చోవడం అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం రాహుల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments