Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం... భార్యను ముక్కలు ముక్కలుగా చేసి... ఆ తరువాత?(Video)

అక్రమ సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు ఓ భర్త. పోలీసులకు ఆధారాలకు దొరక్కుండా మృతదేహాన్ని ఛిద్రం చేసి తిరుపతిలోని మంగ

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (16:04 IST)
అక్రమ సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు ఓ భర్త. పోలీసులకు ఆధారాలకు దొరక్కుండా మృతదేహాన్ని ఛిద్రం చేసి తిరుపతిలోని మంగళం సమీపంలో పడేసి వెళ్ళిపోయాడు. సుమారు రెండు సంవత్సరాల పాటు పోలీసులు కేసును ఛేదించి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. 
 
నెల్లూరు జిల్లా కావలిలో చంద్రమౌళి, ఉమాదేవి భార్యాభర్తలు ఉన్నారు. వీరికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే పాప తనకు పుట్టలేదని, అక్రమ సంబంధం ద్వారానే పుట్టిందని అనుమానం పెంచుకున్న చంద్రమౌళి భార్యను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 2015 మార్చి 21వ తేదీన ఉమాదేవిని తిరుపతికి తీసుకొచ్చి మంగళం రోడ్డులో చంపి పడేసి వెళ్ళిపోయాడు. మృతురాలి ఆచూకీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు చంద్రమౌళి. 
 
అలాగే చిన్నపాపను కలకత్తా రైలులో వైజాగ్ వరకు తీసుకెళ్ళి వదిలి వచ్చేశాడు. ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో పోలీసులు రెండు సంవత్సరాలుగా కేసును దర్యాప్తు చేస్తూనే వున్నారు. అయితే తాజాగా కావలిలో ఒక మహిళ మిస్సింగ్ కేసు రావడంతో ఆ కేసును ఆధారంగా చేసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వెంటనే హత్యకు కారకుడైన నిందితులు చంద్రమౌళితో పాటు అతని స్నేహితులు మాలకొండయ్య, వెంకట రాజేష్‌ కుమార్‌ను తిరుపతిలోని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైలులో వదిలేసిన పాప ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments