Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రాజెక్టులు ఆపకపోతే బీడుగా ఏపీ జిల్లాలు: కేంద్రానికి ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:02 IST)
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల అంశం వివాదాస్పదమవుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండడంతో సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించడంలేదు.

తాజాగా ఈ అంశంలో ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య కేంద్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, అవి పూర్తయితే ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు నీరందక బీడుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలవనరుల శాఖ అత్యున్నత మండలి, సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకోకుండానే కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి, దిండి, మిషన్ భగీరథ, భక్త రామదాసు, తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య తన లేఖలో ఆరోపించింది.

శ్రీశైలం, సాగర్ లకు ఎగువన నిర్మితమవుతున్న ఈ డ్యామ్ లను ఆపి, దిగువ రాష్ట్రమైన ఏపీ రైతుల హక్కులను సంరక్షించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments