తెలంగాణ ప్రాజెక్టులు ఆపకపోతే బీడుగా ఏపీ జిల్లాలు: కేంద్రానికి ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:02 IST)
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల అంశం వివాదాస్పదమవుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండడంతో సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించడంలేదు.

తాజాగా ఈ అంశంలో ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య కేంద్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, అవి పూర్తయితే ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు నీరందక బీడుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలవనరుల శాఖ అత్యున్నత మండలి, సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకోకుండానే కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి, దిండి, మిషన్ భగీరథ, భక్త రామదాసు, తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య తన లేఖలో ఆరోపించింది.

శ్రీశైలం, సాగర్ లకు ఎగువన నిర్మితమవుతున్న ఈ డ్యామ్ లను ఆపి, దిగువ రాష్ట్రమైన ఏపీ రైతుల హక్కులను సంరక్షించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments