అవార్డు తీసుకుంటే, లొంగిపోయిన‌ట్లే: జ‌ర్న‌లిస్ట్ సాయినాథ్

Webdunia
సోమవారం, 12 జులై 2021 (21:36 IST)
ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన వార్త‌లు రాసే, త‌ప్పొప్పులను బ‌య‌ట‌పెట్టే జ‌ర్న‌లిస్టులు అవార్డులు స్వీక‌రిస్తే, అది వారికి లొంగిపోయిన‌ట్లే అని జ‌ర్న‌లిస్ట్ సాయినాథ్ పేర్కొన్నారు. ఇటీవ‌ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త‌న‌కు ప్రకటించిన వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును జర్నలిస్ట్ పీ.సాయినాథ్ తిర‌స్క‌రించారు.

జ‌ర్నలిస్టుల వృత్తి ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను బయట పెట్టడం అని, అవార్డులు తీసుకుంటే లొంగిపోవడం అని ఆయ‌న అభివ‌ర్ణించారు. జ‌ర్న‌లిస్టులు ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు ఎక్స్ట‌ర్న‌ల్ ఆడిట‌ర్ల లాంటి వార‌ని, అందుకే, ప్ర‌భుత్వ ప్ర‌భావానికి లోను కావ‌ద్ద‌న్నారు.

ఇటీవ‌ల వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వం వివిధ రంగాల్లో 63 మందికి వైఎస్ ఆర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ప్ర‌క‌టించింది. గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా వ్య‌వ‌సాయ రంగం, చేతి వృత్తుల విభాగంలో ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. గతంలో సాయినాథ్, మోడీ ప్రభుత్వం యొక్క వ్యవసాయ భీమా మోసం గురించి అనేక పరిశోధనాత్మక కథనాలను రాశారు. అయితే, ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డును సాయినాధ్ వెంట‌నే తిర‌స్క‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments