సింపుల్ చాలెంజ్... వాళ్ల అభ్యర్థి ఓడితే రోజా అది చేయించుకుంటే చాలు... బోండా(వీడియో)

వైసిపి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, మాట్లాడే మాటల్లో అర్థం ఉండాలని, నంద్యాల ఉపఎన్నికల్లో అధికార పార్టీపై అనవసర విమర్శలు చేసిన రో

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (17:43 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, మాట్లాడే మాటల్లో అర్థం ఉండాలని, నంద్యాల ఉపఎన్నికల్లో అధికార పార్టీపై అనవసర విమర్శలు చేసిన రోజాకు బహిరంగ సవాల్ విసురుతున్నానన్నారు బోండా ఉమ. 
 
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి ఓడిపోతే నంద్యాలలోని నడిరోడ్డుపై గుండు గీయించుకోవడానికి తాను సిద్థంగా ఉన్నానని, అదే వైసిపి అభ్యర్థి ఓడిపోతే గుండు గీయించుకోవడానికి రోజా సిద్ధంగా ఉన్నారా అంటూ బహిరంగ సవాల్ విసిరారు బోండా ఉమ. పెద్దపెద్ద మాటలు వద్దనీ, ఇదో సింపుల్ చాలెంజ్ అనీ, పార్టీ కార్యాలయాలు మూసుకోవడం, రాజకీయ సన్యాసాలు చేసుకోవడం అంతా వద్దనీ... ఎవరి పార్టీ అభ్యర్థి ఓడితే వాళ్లు గుండు కొట్టించుకుంటే చాలన్నారు. తమ పార్టీ అభ్యర్థి ఓడితే తను గుండు గీయించుకోవడానికి సిద్ధమనీ, రోజా కూడా తన సవాలును తీసుకుంటారా అని ప్రశ్నించారు.
 
బోండా ఉమ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై రోజా గాని, ఆ పార్టీ నేతలు గాని అస్సలు స్పందించడం లేదు. కాగా నేటితో నంద్యాల ఉపఎన్నికల ప్రచారం ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments