Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింపుల్ చాలెంజ్... వాళ్ల అభ్యర్థి ఓడితే రోజా అది చేయించుకుంటే చాలు... బోండా(వీడియో)

వైసిపి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, మాట్లాడే మాటల్లో అర్థం ఉండాలని, నంద్యాల ఉపఎన్నికల్లో అధికార పార్టీపై అనవసర విమర్శలు చేసిన రో

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (17:43 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, మాట్లాడే మాటల్లో అర్థం ఉండాలని, నంద్యాల ఉపఎన్నికల్లో అధికార పార్టీపై అనవసర విమర్శలు చేసిన రోజాకు బహిరంగ సవాల్ విసురుతున్నానన్నారు బోండా ఉమ. 
 
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి ఓడిపోతే నంద్యాలలోని నడిరోడ్డుపై గుండు గీయించుకోవడానికి తాను సిద్థంగా ఉన్నానని, అదే వైసిపి అభ్యర్థి ఓడిపోతే గుండు గీయించుకోవడానికి రోజా సిద్ధంగా ఉన్నారా అంటూ బహిరంగ సవాల్ విసిరారు బోండా ఉమ. పెద్దపెద్ద మాటలు వద్దనీ, ఇదో సింపుల్ చాలెంజ్ అనీ, పార్టీ కార్యాలయాలు మూసుకోవడం, రాజకీయ సన్యాసాలు చేసుకోవడం అంతా వద్దనీ... ఎవరి పార్టీ అభ్యర్థి ఓడితే వాళ్లు గుండు కొట్టించుకుంటే చాలన్నారు. తమ పార్టీ అభ్యర్థి ఓడితే తను గుండు గీయించుకోవడానికి సిద్ధమనీ, రోజా కూడా తన సవాలును తీసుకుంటారా అని ప్రశ్నించారు.
 
బోండా ఉమ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై రోజా గాని, ఆ పార్టీ నేతలు గాని అస్సలు స్పందించడం లేదు. కాగా నేటితో నంద్యాల ఉపఎన్నికల ప్రచారం ముగిసింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments