Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్ మూలాల వేట కోసం నరసారావు పేటకు వచ్చిన ఐటీ - ఐటీ బృందాలు

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (16:10 IST)
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన హింసాకాండకు మూలాలు గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చే వేధింగా ఇక్కడ సాయి డిఫెన్స్ అకాడెమీ నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆవుల సుబ్బారావును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ నేపథ్యంలో అకాడెమీలో తనిఖీల కోసం నరసారావుపేటకు ఐటీ, ఐబీ అధికారుల బృందాలు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా నరసారావు పేటలో ఉన్న సాయి డిఫెన్స్ అకాడెమీలో వారు తనిఖీలు చేశారు. 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు నరసారావుపేట కేంద్రమని పోలీసులు తేల్చారు. దంతో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇక్కడకు చేరుకుని పట్టణంలోని సాయి డిఫెన్స్ అకాడెమీకి వెళ్లారు. 
 
అక్కడ వారు అకాడెమీ రికార్డులను నిశితంగా పరిశీలించారు. అకాడెమీలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా అకాడెమీలో పని చేసే సిబ్బందిని కూడా ఐటీ, ఐబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments