Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ముందు మోకాళ్ళపై కూర్చొన్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (15:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వైకాపా కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారంటూ విపక్ష పార్టీలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఇపుడు ఓ ఐఏఎస్ అధికారి అదేవిధంగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి జగన్ ముందు మోకాళ్ళపై కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం 73వ గణతంత్ర వేడుకలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం జగన్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ పిలుపు వినగానే సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆగమేఘాలపై ఆయన ముందు వాలిపోయి మోకాళ్లపై కూర్చొని సీఎంతో మాట్లాడారు. ఈ సంఘటనపై భిన్న రకాలైన స్పందనలు వినిపిస్తున్నాయి. గతంలో మాజీ కలెక్టర్ వెంకట్రామయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లపై పడ్డారు. ఇది వివాదాస్పదమైంది. ఇపుడు ఏపీలో జరిగిన ఘటనపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు బ్యూరోక్రాట్లుగా వ్యవహరించడం లేదని వైకాపా కార్యకర్తల్లా నడుచుకుంటున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments