సీఎం జగన్ ముందు మోకాళ్ళపై కూర్చొన్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (15:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వైకాపా కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారంటూ విపక్ష పార్టీలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఇపుడు ఓ ఐఏఎస్ అధికారి అదేవిధంగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి జగన్ ముందు మోకాళ్ళపై కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం 73వ గణతంత్ర వేడుకలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం జగన్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ పిలుపు వినగానే సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆగమేఘాలపై ఆయన ముందు వాలిపోయి మోకాళ్లపై కూర్చొని సీఎంతో మాట్లాడారు. ఈ సంఘటనపై భిన్న రకాలైన స్పందనలు వినిపిస్తున్నాయి. గతంలో మాజీ కలెక్టర్ వెంకట్రామయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లపై పడ్డారు. ఇది వివాదాస్పదమైంది. ఇపుడు ఏపీలో జరిగిన ఘటనపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు బ్యూరోక్రాట్లుగా వ్యవహరించడం లేదని వైకాపా కార్యకర్తల్లా నడుచుకుంటున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments