Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎఎస్, ఐపిఎస్‌లు రైతులుగా మారి పొలంలోకి దిగి..?

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (22:56 IST)
వృత్తిరీత్యా ఒకరు జిల్లాస్థాయి అధికారి.. ఇద్దరు అర్బన్ జిల్లా ఉన్నతాధికారులు. వృత్తిని మర్చిపోయారు. రైతులను చూసి వెంటనే పొలంలోకి దిగారు. పొలంలో వరినాట్లు వేశారు. ఐఎఎస్, ఐపిఎస్ స్థాయిని మరిచి వరి నాట్లు వేశారు. తాము రైతు బిడ్డలమని నిరూపించుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
ఒకరేమో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్త, మరొకరేమో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి. ఇంకొకరు తిరుపతి నగర పాలకసంస్థ కమిషనర్ గిరీషా.. వీరు ముగ్గురు ఐఎఎస్, ఐపిఎస్ చేసిన వారే. తమ పరిపాలనతో అందరి మన్ననలను పొందుతున్నారు. అయితే వీరు ముగ్గురు ఒకేచోట కలిశారు. 
 
తిరుపతికి సమీపంలోని ఒక పొలంలో దిగారు ముగ్గురు. వృత్తిని పక్కనబెట్టి వరినాట్లు నాటారు. ఆనందంగా ముగ్గురు గంటపాటు పొలంలోనే గడిపారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వీరు రావడంతో పాతజ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఉన్నతాధికారులు పొలంలో దిగి పనులు చేయడం చూసి జనం ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments