Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షాకు పాద పూజ చేస్తా... సిపిఐ నేత నారాయణ (వీడియో)

ఎప్పుడూ వార్తల్లో నిలిచే సిపిఐ నేత నారాయణ మరోసారి బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పాలన మొత్తం అవినీతిమయమేనని విమర్శించారు. బిజెపి నేతలంతా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారాయన. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామ

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (21:13 IST)
ఎప్పుడూ వార్తల్లో నిలిచే సిపిఐ నేత నారాయణ మరోసారి బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పాలన మొత్తం అవినీతిమయమేనని విమర్శించారు. బిజెపి నేతలంతా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారాయన. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని మోడీ మాటలు చెప్పడం తప్ప, అది సాధ్యం కావడం లేదన్నారు. అమిత్ షా కుమారుడు సంవత్సరంలో కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
ప్రజలందరూ కోట్లు సంపాదించేందుకు అమిత్ షా సహకరిస్తే ఆయనకు పాదపూజ చేస్తానని చెప్పారు నారాయణ. తమను ప్రశ్నించే వారే ఉండకూడదంటూ కేరళ, మమతా బెనర్జీలపై కేంద్రం దాడులు చేయిస్తోందని ఆరోపించారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ, సిపిఎం కార్యదర్శులు శ్రీకాకుళంలో ఆందోళన చేపడితే వారిని అరెస్టు చేసి ఇచ్ఛాపురం జైలుకు తరలించడాన్ని తప్పుబట్టారు నారాయణ. వెంటనే సిపిఐ నేత రామక్రిష్ణ, సిపిఎం నేత మధులను విడుదల చేయాలని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments