Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ భగవో, ఆంధ్రాకో బచావో.. ఆదివారం రోడ్లపై కూర్చోండి ప్లీజ్!: శివాజీ

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (20:12 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రులతో ప్రకటనలు చేయిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై ఒత్తిడి తేవాలని ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షుడు, నటుడు శివాజీ తెలిపారు. ఏపీ ప్రజలను బీజేపీ సర్కారు మోసం చేయకూడదన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మోడీ సర్కారు గుర్తుంచుకోవాలని శివాజీ సూచించారు. 
 
విజయవాడలో కాగడాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ భగావో, ఆంధ్రాకో బచావో అంటూ నినాదాలు లేవనెత్తారు. శివాజీతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, చలసాని శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ఏపీ మొత్తం ఆదివారం ఒక్కరోజు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎలా సాకారమైందో గుర్తుంచుకుని.. ఏపీ ప్రజలు సైతం హోదా కోసం పోరాటం చేయాలన్నారు. ఒకప్పుడు రెండు సీట్లు కూడా లేని బీజేపీకి దేశాన్ని పాలించే అధికారం ఇస్తే మోసం చేస్తారా అని శివాజీ ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీ నుంచి అనంతపురంలో నిరవధిక దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments