Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ భగవో, ఆంధ్రాకో బచావో.. ఆదివారం రోడ్లపై కూర్చోండి ప్లీజ్!: శివాజీ

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (20:12 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రులతో ప్రకటనలు చేయిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై ఒత్తిడి తేవాలని ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షుడు, నటుడు శివాజీ తెలిపారు. ఏపీ ప్రజలను బీజేపీ సర్కారు మోసం చేయకూడదన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మోడీ సర్కారు గుర్తుంచుకోవాలని శివాజీ సూచించారు. 
 
విజయవాడలో కాగడాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ భగావో, ఆంధ్రాకో బచావో అంటూ నినాదాలు లేవనెత్తారు. శివాజీతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, చలసాని శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ఏపీ మొత్తం ఆదివారం ఒక్కరోజు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎలా సాకారమైందో గుర్తుంచుకుని.. ఏపీ ప్రజలు సైతం హోదా కోసం పోరాటం చేయాలన్నారు. ఒకప్పుడు రెండు సీట్లు కూడా లేని బీజేపీకి దేశాన్ని పాలించే అధికారం ఇస్తే మోసం చేస్తారా అని శివాజీ ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీ నుంచి అనంతపురంలో నిరవధిక దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments