Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో వైజాగ్ నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తా: జేడీ లక్ష్మీనారాయణ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (10:09 IST)
ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీతో కలిసి పనిచేసిన జనసేన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే ఆలోచనలో వుంది. ఇటీవ‌లే చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ కావడంతో ఇదే ఊహాగానాలు వ‌స్తున్నాయి. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది. మ‌రోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ కూడా పోటీ చేయ‌బోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర‌లు కూడా చేయ‌బోతున్నారు. 
 
గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున పోటీ చేసిన మాజీ సీబీఐ ఆఫీస‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 
 
విశాఖ నుంచే ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి తాను నిల‌బ‌డ‌బోన‌ని, త‌న సొంత చ‌రిస్మాతోనే పోటీ చేస్తాన‌ని తేల్చి చెప్పేశారు. వైజాగ్ నుంచి తప్పకుండా తాను గెలుపును నమోదు చేసుకుంటానని వెల్లడించారు. ఎన్నికల కోసం ఇంకా రెండేళ్ల సమయం వుందని.. కానీ ఏపీలో ఇప్పుడే ఎన్నికల సందడి మొదలైందని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments