Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి అంటే నచ్చదు - వైకాపా నేతలంతా ఆర్థికంగా చితికిపోయారు.. మంత్రి ధర్మాన

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:58 IST)
వైకాపాలోని నేతలంతా ఆర్థికంగా చితికిపోయారని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. పైగా, తామంతా అవినీతికి దూరంగా ఉన్నామంటూ సెలవిచ్చారు. అవినీతి రహిత సమాజం కోసం ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని పట్టుకుని అనరాని మాటలు అంటారా అని మండిపడ్డారు. 
 
శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ, తనకు అవినీతి అంటేనే నచ్చదన్నారు. పైగా, ఒక్క నయాపైసా అవినీతికి పాల్పడినట్టు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. తనను గెలిపించిన ప్రజలను తలదించుకునే పరిస్థితి ఏనాడూ చేయనన్నారు. 
 
ఉద్యోగులు కూడా అవినీతికి దూరంగా ఉండాలని కోరారు. పార్టీలోని నేతలందరూ ఆర్థికంగా చితికిపోయారని, అయినప్పటికీ ఎక్కడా కూడా ఒక్క పైసా అవినీతికి పాల్పడటం లేదన్నారు. అవినీతి లేని సమాజం రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మార్పు తీసుకుని రావాలనే జగన్ వంటి నేతలు కఠినంగా ఉంటారని, అలాంటి వ్యక్తిని నానా మాటలు అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments