అవినీతి అంటే నచ్చదు - వైకాపా నేతలంతా ఆర్థికంగా చితికిపోయారు.. మంత్రి ధర్మాన

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:58 IST)
వైకాపాలోని నేతలంతా ఆర్థికంగా చితికిపోయారని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. పైగా, తామంతా అవినీతికి దూరంగా ఉన్నామంటూ సెలవిచ్చారు. అవినీతి రహిత సమాజం కోసం ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని పట్టుకుని అనరాని మాటలు అంటారా అని మండిపడ్డారు. 
 
శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ, తనకు అవినీతి అంటేనే నచ్చదన్నారు. పైగా, ఒక్క నయాపైసా అవినీతికి పాల్పడినట్టు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. తనను గెలిపించిన ప్రజలను తలదించుకునే పరిస్థితి ఏనాడూ చేయనన్నారు. 
 
ఉద్యోగులు కూడా అవినీతికి దూరంగా ఉండాలని కోరారు. పార్టీలోని నేతలందరూ ఆర్థికంగా చితికిపోయారని, అయినప్పటికీ ఎక్కడా కూడా ఒక్క పైసా అవినీతికి పాల్పడటం లేదన్నారు. అవినీతి లేని సమాజం రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మార్పు తీసుకుని రావాలనే జగన్ వంటి నేతలు కఠినంగా ఉంటారని, అలాంటి వ్యక్తిని నానా మాటలు అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments