Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో ప్రియుడితో నగ్నంగా కనిపించిన భార్య... భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపిన వైనం...

ఓ మహిళ కట్టుకున్న భర్త కంటే మాయమాటలు చెప్పి తన సుఖం తీర్చుకుంటూ వచ్చిన ప్రియుడే గొప్ప అని భావించింది. ఇందుకోసం అతనితో కలిసి భర్తను కడతేర్చింది. ఆ తర్వాత చేసిన హత్యను సహజ మరణమని నమ్మించేందుకు శతవిధాలా

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (14:08 IST)
ఓ మహిళ కట్టుకున్న భర్త కంటే మాయమాటలు చెప్పి తన సుఖం తీర్చుకుంటూ వచ్చిన ప్రియుడే గొప్ప అని భావించింది. ఇందుకోసం అతనితో కలిసి భర్తను కడతేర్చింది. ఆ తర్వాత చేసిన హత్యను సహజ మరణమని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. హైదరాబాద్, బాలానగర్‌ ఏరియాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, నెహ్రూ నగర్‌కు చెందిన రమేష్‌ (38) అనే వ్యక్తి ఎల్ఐసి ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదే ప్రాంతంలో ఉంటున్న ఎంటీఏఆర్‌ కంపెనీలో మెషిన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అమరేందర్‌ (36)తో దేవికి పరిచయం ఏర్పడింది. ఇది వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. చనువు ఎక్కువ కావడంతో రమేష్ లేని సమయంలో దేవి ఇంటికి అమరేందర్ వచ్చి వెళ్లేవాడు. ఈ విషయం తెలుసుకున్న రమేష్‌.. భార్యతో గొడవపడి మరో ప్రాంతానికి నివాసం మార్చాడు. 
 
అయినా అమరేందర్‌‌ను దేవి ఇంటికి పిలిపించుకుని తన శారీరకసుఖం తీర్చుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీన సాయంత్రం రమేష్‌ ఇంటికొచ్చేసరికి అమరేందర్‌తో దేవి పడక గదిలో నగ్నంగా ఉండడాన్ని గమనించి ఘర్షణపడ్డాడు. దీంతో విషయం బయటకు పొక్కకుండా తన ప్రియుడితో కలిసి దేవి.. భర్త రమేష్‌ ముఖంపై తలగడ పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అర్థరాత్రి సమయంలో చుట్టుపక్కల వారిని నిద్రలేపి భర్త కదలడంలేదని ఏడుస్తూ ఆమె చెప్పడంతో 108కి ఫోన్‌ చేయగా వారు వచ్చి మృతి చెందినట్లు ధృవీకరించారు. 
 
గుండెపోటుతో మరణించి ఉంటాడని చుట్టు పక్కలవారిని నమ్మించింది. మరుసటి రోజు చింతల్‌లో ఉండే మృతుడి తల్లి కృష్ణకుమారి కోడలిపై అనుమానం ఉందని అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆ నివేదిక ఆధారంగా విచారించగా దేవి, అమరేందర్‌ నేరం అంగీకరించారు. సోమవారం వారిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments