Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి వెళ్తే.. స్నేహితులతో కలిసి అత్యాచారం

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:32 IST)
తనను కలవాలంటూ తెలిసిన వ్యక్తి పిలిస్తే వెళ్లిన మహిళపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ దారుణం హైదరాబాద్‌ నగరంలో జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుపై సోమవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.
 
కొత్తపేట గ్రీన్‌హిల్స్‌ కాలనీలో నివాసముంటున్న సదరు మహిళ (32)కు ఐదేళ్ళ క్రితం పెళ్లి కాగా, భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో మన్సురాబాద్‌కు చెందిన సీసీ కెమెరాల వ్యాపారి మనోజ్‌కుమార్‌ (30)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. మనోజ్‌కుమార్‌ తన 5 మంది స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని సాహెబ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పార్టీ ఉందని ప్రియురాలిని పిలిపించారు. అక్కడికి వెళ్లిన ఆమెకి మనోజ్‌కుమార్, అతని స్నేహితులు బలవంతంగా మద్యం తాగించారు. 
 
అధిక మద్యం తాగిన మనోజ్‌కుమార్‌ ప్రియురాలు నిద్రమత్తులోకి జారుకుంది. ఇదే అదునునుగా భావించిన మనోజ్‌కుమార్, అతని స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన మహిళ తనకు జరిగిన అన్యాయంపై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments