Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొందరపడి రెండో పెళ్లి చేసుకున్న వైద్యురాలు.. జీవితంపై విరక్తితో సూసైడ్

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (13:28 IST)
ఓ వైద్యురాలు రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె ఆలోచన మారింది. తొందరపడి రెండో పెళ్ళి చేసుకున్నట్టు లోలోప మథనపడింది. రెండో భర్త ఎలా చూసుకుంటాడోనన్న ఆందోళన ఆమెలో మొదలైంది. అంతే, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, కళ్యాణ్‌ నగర్‌‌కు చెందిన శ్రావణి (35) అనే మహిళ ఓ వైద్యురాలిగా కొనసాగుతోంది. ఈమెకు కొన్నేళ్ల క్రితం వివాహం కాగా, భర్తతో ఏర్పడిన మనస్పర్థలు కారణంగా విడిపోయింది. 
 
ఈ పరిస్థితుల్లో గత నవంబరు నెలలో శ్రీనివాస్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తన ఉద్యోగం నిమిత్తం శ్రీనివాస్ తమిళనాడుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆమె బాత్ రూమ్‌లో కిటికీకి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. బయటి నుంచి ఎంతసేపు తలుపు తట్టినా సమాధారం లేకపోవడంతో, అనుమానం వచ్చిన తల్లి, చుట్టుపక్కల వారి సాయంతో లోపలికి వెళ్లి చూడగా, శ్రావణి విగతజీవిగా కనిపించింది.
 
విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని శ్రావణి రాసిన ఆత్మహత్యా లేఖను స్వాధీనం చేసుకున్నారు. తల్లి దండ్రులు తనను బాగా చూసుకున్నారని, తానే రెండో పెళ్లికి తొందర పడ్డానని, కొత్తగా తన జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఎలా చూసుకుంటాడో తెలియడం లేదని ఆందోళనగా అందులో రాసింది. పైగా, ఈ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని పేర్కొంది. తనకే జీవితంపై విరక్తి కలిగి, ఈ పనికి పాల్పడినట్టు పేర్కొంది. దీంతో పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments