Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్లో ముద్ద పెట్టుకుంటూ ప్రాణాలు విడిచిన తెరాస నేత...

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (11:48 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఓ అపశృతి చోటుచేసుకుంది. తెరాస నేత ఒకరు భోజనం చేస్తూచేస్తూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం జీడిమెట్ల డివిజన్‌లో తెరాస నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యకర్తలకు రుక్మిణి ఎస్టేట్‌లో భోజన ఏర్పాట్లు చేశారు. వెన్నెలగడ్డకు చెందిన రమేశ్‌(57) నాయకులతోపాటు బస్తీలో తిరుగుతూ ప్రచారం నిర్వహించాడు. 
 
ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కార్యకర్తలు అతడిని సమీపంలోగల ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించారు. మృతుడికి ముగ్గురు కుమారులు. గుండెపోటుతో మరణించారని తెరాస నేతలు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments