Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌కెళ్లిన దంపతులు.. ఇంటికొచ్చాక టెక్కీ వైఫ్ సూసైడ్.. ఎందుకని?

హైదరాబాద్ నగరంలో ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. రాత్రి పబ్‌కెళ్లి ఇంటికొచ్చిన ఆమె ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Webdunia
సోమవారం, 7 మే 2018 (10:44 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. రాత్రి పబ్‌కెళ్లి ఇంటికొచ్చిన ఆమె ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ లంగర్‌హౌజ్‌కు చెందిన ఉజ్వల్, మనస్థలిపురంకు చెందిన రేఖ(30)లు పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా చందానగర్‌లోని అపర్ణ గార్డెనియా ప్లాట్ నెంబర్ 801ఏలో నివశిస్తున్నారు.
 
అయితే, దంపతులిద్దరూ గచ్చిబౌలిలోని ఐబీఎం సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. రేఖ కుటుంబ బాధ్యతలను పట్టించుకోదని, ఇతరులతో ఫోన్లు మాట్లాడటం తనకు నచ్చదని ఉజ్వల్ ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా, రాత్రి దంపతులిద్దరు గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లారు. ఇంటికి వచ్చాక గొడవపడి వేర్వేరు గదుల్లో పడుకున్నారు. ఉదయం ఉజ్వల్ లేచి చూసే సరికి రేఖ ఫ్యానుకు చీరతో వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. 
 
అయితే, రేఖ మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రేఖ అత్మహత్య చేసుకుందా? లేక భార్యపైన కోపంతో భర్త ఉజ్వలే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments