Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయం కోసం వచ్చిన మహిళను ఎస్ఐ ఏం చేశాడంటే...

తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ఎస్ఐ ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, చివరకు ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె భర్తకే వార్నింగ్ ఇచ్చాడు.

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (09:55 IST)
తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ఎస్ఐ ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, చివరకు ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె భర్తకే వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విషయం సీరియస్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండే ఓ వివాహిత... తన భర్తపై కేసు పెట్టేందుకు స్టేషన్‌కు వచ్చింది. అయితే... ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎస్సై నర్సింహ ఆ మహిళతో మాటామంతీ కలిసి చివరకు ఆమెను ట్రాప్ చేశాడు. అనంతరం వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగసాగారు. 
 
ఆ తర్వాత ఆ మహిళను తన వశం చేసుకునేందుకు ఆ మహిళ భర్తకు ఎస్సై ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో ఖంగుతిన్న భర్త సతీష్ ఈ విషయాన్ని మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళాడు. ఎస్సై నర్సింహ తనను బెదిరిస్తున్నాడని, ఆయన బారి నుంచి కాపాడాలని మొరపెట్టుకున్నాడు. దీంతో డీసీపీ ఈ వ్యవహారంపై ఆరా తీసి అసలు విషయం తెలుసుకుని గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆ ఎస్సైపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments