Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీ పూరీ తినేందుకు వెళ్లి మృత్యువాతపడ్డారు... ఎలా?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:45 IST)
పానీ పూరీ ఆరగించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్.ఐ నాగేశ్వర రావు వెల్లడించిన వివరాలమేరకు... హైదరాబాద్ తుక్కుగూడ గ్రామానికి చెందిన కట్టెల శ్రీనివాస్ ‌(28) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ పేట్రోల్ బంగులో పని చేస్తున్నాడు. 
 
అయితే, ఈయనకు పానీపురీ తినాలని ఆశ కలిగింది. దీంతో అతను స్థానిక సిండికేట్‌ బ్యాంక్‌ సమీపంలోని పానీపూరీ బండి వద్దకు వెళ్లి పానీపూరి ఇవ్వాలని యజమాని బాబూరావును కోరాడు. 
 
తానీ, శ్రీనివాస్‌కు బాబూరావు పానీపూరి ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇదే విషయంపై వారిద్ధరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో కోపం పట్టలేక పానీపూరీ బండి అద్దంపై శ్రీనివాస్ బలంగా కొట్టాడు. అతని దెబ్బకు అద్దం పగిలి మోచేతికి గుచ్చుకుంది. 
 
పైగా, శ్రీనివాస్ మోచేయి నరం తెగిపోవడంతో తీవ్ర  రక్తస్రావమైంది. దీన్ని గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా అతడి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి సోదరుడు గణేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments