Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీ పూరీ తినేందుకు వెళ్లి మృత్యువాతపడ్డారు... ఎలా?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:45 IST)
పానీ పూరీ ఆరగించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్.ఐ నాగేశ్వర రావు వెల్లడించిన వివరాలమేరకు... హైదరాబాద్ తుక్కుగూడ గ్రామానికి చెందిన కట్టెల శ్రీనివాస్ ‌(28) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ పేట్రోల్ బంగులో పని చేస్తున్నాడు. 
 
అయితే, ఈయనకు పానీపురీ తినాలని ఆశ కలిగింది. దీంతో అతను స్థానిక సిండికేట్‌ బ్యాంక్‌ సమీపంలోని పానీపూరీ బండి వద్దకు వెళ్లి పానీపూరి ఇవ్వాలని యజమాని బాబూరావును కోరాడు. 
 
తానీ, శ్రీనివాస్‌కు బాబూరావు పానీపూరి ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇదే విషయంపై వారిద్ధరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో కోపం పట్టలేక పానీపూరీ బండి అద్దంపై శ్రీనివాస్ బలంగా కొట్టాడు. అతని దెబ్బకు అద్దం పగిలి మోచేతికి గుచ్చుకుంది. 
 
పైగా, శ్రీనివాస్ మోచేయి నరం తెగిపోవడంతో తీవ్ర  రక్తస్రావమైంది. దీన్ని గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా అతడి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి సోదరుడు గణేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments