Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవును.. పానీ పూరీ ప్రాణం తీసింది..

అవును.. పానీ పూరీ ప్రాణం తీసింది..
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:20 IST)
అవును.. పానీ పూరీ ప్రాణం తీసింది. ఇదేంటి.. పానీ పూరీ తినడం వల్ల ప్రాణం పోయిందా అనుకునేరు. కాదు.. పానీపూరి బండి వద్ద జరిగిన గొడవలో గాజు గ్లాసు పగిలి ఓ వ్యక్తి చేతికి తీవ్రంగా గాయమైంది. ఆస్పత్రికి తరలించే లోపు ఏకధాటిగా రక్తం కారడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఠానాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పహాడీషరీఫ్ తుక్కుగూడకు చెందిన కట్టెల శ్రీనివాస్ (28) బుధవారం రాత్రి పది గంటలకు.. మద్యం మత్తులో బైకును నడిపాడు. ఈ బైకు కాస్త చౌరస్తాలోని పానీ పూరి బండి వద్దకు వెళ్లింది. మద్యం మత్తులో వున్న వ్యక్తి.. పానీపూరీ కావాలని అడగడంతో ఆ పానీపూరీ అమ్మేవాడు లేదని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ అతనితో ఘర్షణకు దిగాడు. ఇదేంటని అక్కడే వున్నయాదయ్య అనే వ్యక్తి.. వారిద్దరి గొడవను ఆపాలని చూశాడు. 
 
ఆవేశంలో పానీపూరి బండిపై వున్న గాజుపై గట్టిగా శ్రీనివాస్ బాదాడు. దీంతో అక్కడ ఉన్న గాజు గ్లాసు పగిలి శ్రీనివాస్‌ కుడిచేతి నరానికి తగిలి తీవ్రగాయమైంది. గాజు ముక్కలు గాయంలో బాగా ఇరుక్కుపోవడంతో రక్తం ధారలా కారింది. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే చాలా రక్తంపోవడంతో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెజవాడలో రెచ్చిపోతున్న ఈవ్‌టీ(నే)జర్స్