Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కుమార్తె రేప్ చేసిన వ్యక్తి హత్య కేసు... లొంగిపోయిన తండ్రి

తన కుమార్తె అనూషను అత్యాచారం చేసి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన గుంటి రాజేష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో మృతురాలి తండ్రి కోర్టులో లొంగిపోయాడు. ఆయన పేరు శ్యాంసుందర్ రెడ్డి. హైదరాబాద్ శివార్లల

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (10:57 IST)
తన కుమార్తె అనూషను అత్యాచారం చేసి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన గుంటి రాజేష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో మృతురాలి తండ్రి కోర్టులో లొంగిపోయాడు. ఆయన పేరు శ్యాంసుందర్ రెడ్డి. హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్‌లో గత నెల 27వ తేదీన ఈ దారుణం జరిగింది. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే, రాజేష్ హత్య అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన శ్యాంసుందర్ ఆపై ఆధిబట్ల పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. 
 
ఓ గుడికి చైర్మన్‌గా ఉన్న రాజేష్, భూదందాలు, రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్లు, అత్యాచారాలు, బెదిరింపులకు అలవాటు పడ్డాడని, అతనికి బతికే హక్కు లేదని చెప్పాడు. అతన్ని తాను చంపలేదని, తనపై అనుమానాలు ఉన్నాయి కాబట్టి లొంగిపోయేందుకు వచ్చానని తెలిపాడు. 
 
తన కుమార్తెకు మత్తుమందిచ్చి, ఆపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడని చెప్పాడు. దాన్ని యూట్యూబ్‌లో పెడతానని బెదిరిస్తూ, మానసిక హింసకు గురిచేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని వివరించాడు. రాజేష్ హత్యను ఎవరు చేశారన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుందని చెప్పాడు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments