Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలీ డబ్బుల కోసం తమ్ముడి హత్య...

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (12:11 IST)
కూలీ డబ్బులు రూ.300 కోసం తమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నకు జీవితకారాగారశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హైదారాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో జరిగిన ఈ కేసులో తీర్పు తాజాగా వెలువడింది. హైదరాబాద్ నగరంలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన కర్రె రాములు (35), కర్రె పోచయ్య (32) అన్నదమ్ములు. 2016 మార్చి 19న ఓ టెంట్‌హౌస్‌లో కూలీకి ఇద్దరు వెళ్ళారు. పనులు పూర్తయ్యాక వచ్చిన డబ్బులో పోచయ్యకు రాములు రూ.300 తక్కువ ఇచ్చాడు. దీంతో పోశయ్య నిలదీశాడు. ఆగ్రహానికి గురైన రాములు అతనిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. 
 
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పోచయ్యను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, పోచయ్య ఆస్పత్రి నుంచి పారిపోయి, అదే నెల 22వ తేదీన ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై 2016 మే 13న పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, కేసు విచారించిన పోలీసులు... రాములుకు జీవితఖైదుతో పాటు రూ.1000 అపరాధం విధిస్తూ నాంపల్లిలోని 14వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. రాములును చంచల్‌గూడ జైలుకు పంజాగుట్ట పోలీసులు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments