Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో దోపిడీదొంగల బీభత్సం, గృహిణి కళ్లల్లో కారం కొట్టి హత్య

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (11:05 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. దోపిడీ దొంగలు తాజాగా తమకు అడ్డొచ్చిన మహిళ కళ్లల్లో కారం కొట్టి గొంతు నులిమి చంపేసిన ఘటన అమీన్ పూర్ లో జరిగింది. సాయివాణి కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ సురేందర్ గౌడ్ఇంటిలో దొంగలు చొరబొడ్డారు. 
 
పూజా మందిరంలో గృహిణి అరుంధతి పూజ చేసుకుంటుండగా ఏదో అలికిడి వినిపించినట్టు అనిపించింది. అటు చూసేసరికి దొంగలు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు. ఇంట్లోని బంగారం, డబ్బంతా ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని దొంగలు బెదిరించారు. దోపిడిని అడ్డుకునేందుకు యత్నించిన డాక్టర్ సురేందర్ గౌడ్ భార్య అరుంధతి కళ్లల్లో కారం చల్లారు దొంగలు. 
 
ఊహించని ఈ హఠాత్ పరిణామానికి తేరుకుని దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించింది ఈ ఇల్లాలు. కేకలు వేస్తుందేమోనని భయపడ్డ దొంగలు ఒక్కసారిగా అరుంధతి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న డాక్టర్ సురేందర్ గౌడ్‌కు తన విగత జీవిలా పడిఉండటాన్ని చూసి షాకయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

Deepika: ప్రభాస్ తో లిప్ లాక్ చేయనని స్పిరిట్ వద్దన్నా : దీపికా పదుకొనె

అర్థరాత్రి తాగి ఖలేజాను చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే : సి. కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments