Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో వైకారా రెబెల్ ఎంపీ రఘురామపై కేసు నమోదు

Webdunia
బుధవారం, 6 జులై 2022 (09:49 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై హైదరాబాద్ నగరంలో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న తనను ఎంపీ, ఆయన నలుగురు అనుచరులు వచ్చి కారులో ఎక్కించుకుని రఘురామ ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వింగ్ కానిస్టేబుల్ షేక్ ఫరూఖ్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రఘురామపై కేసు నమోదు చేసినట్టు గచ్చిబౌలి పోలీసు ఇన్‌స్పెక్టర్ సురేశ్ వెల్లడించారు. ఈ కేసులో రఘురామతో పాటు ఆయన కుమారుు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుళ్ళను నిందితులుగా చేర్చినట్టు ఆయన తెలిపారు. 
 
ఇన్‌స్పెక్టర్ వెల్లడించిన వివరాల మేరకు ఈ నెల 3వ తేదీన రాత్రి గచ్చిబౌలిలోని రఘురామ ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తచ్చాడుతుండటాన్ని ఆయన సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, తాను ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా గచ్చిబౌలిలో ఐఎస్‌బీ ఎదురుగా విధులు నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి తన గుర్తింపును ప్రశ్నిస్తూ దాడి చేశారని ఆయన తెలిపారు. ఆ తర్వాత కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లి ఓ విలాల్లో బంధించి కర్రలతో కొట్టారని దీంతో ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్, ఏఎస్‌ఐలపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments