Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మార్వో హత్య - నిందితుడు మృతి.. మొబైల్ కాల్ డేటా ఆధారంగా..?

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (11:51 IST)
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి హత్యచేయడానికి నిందితుడిని ఎవరైనా ప్రోత్సహించారా? ఎవరున్నారు? అనేది తెలుసుకోవడం మరింత జటిలమైంది. నిందితుడి మొబైల్ కీలకంగా మారడంతో కాల్‌డేటా ఆధారంగా మరికొందర్ని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు.

నవంబరు 4న ఘటన జరిగిన తర్వాత 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియాలో చేరిన సురేష్ కొద్ది గంటల వరకు డాక్టర్లతో మాట్లాడాడు. అతడి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ రికార్డ్ చేసే సమయానికి పోలీసులు అక్కడ లేరు.
 
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో హత్య కేసు మిస్టరీ పోలీసులకు మరింత సవాల్‌గా మారింది.  
 
భూ సమస్య పరిష్కారం కాకపోవడంతోనే తీవ్ర ఆవేదన చెందిన సురేష్.. ఈ ఘటనకు పాల్పడినట్లు అతని మాటలను బట్టి అర్థమైందని ఉస్మానియా వైద్యులు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. నిందితుడు సురేష్‌ చనిపోయినా కేసు దర్యాప్తు కొనసాగుతుందని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ స్పష్టం చేశారు. సురేశ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని అందజేయాలని మేజిస్ట్రేట్‌ను పోలీసులు కోరారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments