Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (08:48 IST)
ఒక యుకుడుని కన్సెల్టెన్సీ పేరుతో మరో యువకుడు వినూత్న తరహాలో మోసం చేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.2.25 లక్షలు వసూలు చేసి ఆ తర్వాత నకిలీ కంపనీ ఆఫర్ లేఖ ఇచ్చాడు. తాను మోసపోయినట్టు తెలుసుకున్న ఆ యువకుడు చివరకు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లాకు చెందిన ఏ.సాయికుమార్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాద్ నగరంలోని వెంగళరావు నగర్‌‍ కాలనీలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, సాయికుమార్‌కు కన్సల్టెన్సీ ఉద్యోగం ఇప్పిస్తానని జానీ అనే యువకుడు నమ్మబలికాడు. అమర్నాథ్ అనే కన్సల్టెన్సీ‌కి డబ్బులు కట్టించాడు. డబ్బులు చెల్లించిన మూడు నెలల తర్వాత ఓ కంపెనీ పేరుతో జూమ్ కాల్ ఇంటర్వ్యూ నిర్వహించి, ఆ కంపెనీ పేరుతో ఆఫర్ లెటర్ సాయి కుమార్‌కు పంపించాడు. 
 
అయితే, ఆ కంపెనీ గురించి సాయి కుమార్ ఆన్‌లైన్‌లో శోధించగా ఎక్కడా వివరాలు తెలియరాలేదు. దీంతో అనుమానం వచ్చిన సాయికుమార్.. అమర్నాథ్‌ను నిలదీశాడు. ఆ మరుక్షణం నుంచి అమర్నాథ్ పరారీలో ఉంటున్నాడు. దీంతో సాయికుమార్ గుంటూరు మధురానగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments