Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ఎల్బీనగర్‌లో వ్యక్తి దారుణహత్య.. బండరాళ్ళతో తలపై మోది!

Webdunia
సోమవారం, 30 మే 2016 (10:42 IST)
హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాళ్ళతో తలపై మోది హత్య చేశారు. ఈ మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఎల్బీనగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌ టీమ్‌, జాగిలాల సాయంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
మృతదేహం పక్కన మద్యం సీసాలు లభ్యమయ్యాయి. బండరాళ్లతో తలపై మోది అతడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాతకక్షల కారణంగా హత్య జరిగి ఉండొచ్చన్న కోణంలో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments