Webdunia - Bharat's app for daily news and videos

Install App

కువైట్ నుంచి వచ్చిన భార్య.. ఎయిర్‌పోర్టులో మిస్సింగ్.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (14:49 IST)
ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన భార్య విమానాశ్రయంలో దిగిన తర్వాత కనిపించకుండా పోయింది. తన భార్య ఎంతకీ రాకపోవడంతో ఆమె భర్త ఆందోళనకుగురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మిస్సింగ్ ఘటన విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరుకు చెందిన సాలసత్తి దుర్గ (32) ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
ఆమె ఈ నెల 16న కువైట్ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. కానీ దుర్గ ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త సత్యనారాయణ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
గన్నవరం ఎయిర్ పోర్టు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా, విమానం దిగిన తర్వాత టెర్మినల్ నుంచి వెలుపలికి వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఎయిర్ పోర్టు బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆమె ఏ వాహనం ఎక్కింది? ఎటు వెళ్లింది? అనేదానిపై స్పష్టత లేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గన్నవరం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments