Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయంకాని వ్యాధి.. ఆర్థిక ఇబ్బందులు.. భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (13:47 IST)
దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన భార్యను కట్టుకున్న భర్త చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా పొన్నురు మండలం కసుకర్రు గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన తుమ్మంపాటి చిన్న సుబ్బయ్య (50), తుమ్మంపాటి రోజా (45) అనే దంపతులు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఈ దంపతులిద్దరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. 
 
అదేసమయంలో వైద్యం చేయించుకునేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేకుండాపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నసుబ్బయ్య.. భార్య రోజాను తలపై కర్రతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఈ దంపతులు తెల్లవారినప్పటికీ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా దంపతులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు నమోదు చేసిన పొన్నూరు గ్రామీణ పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments