Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయంకాని వ్యాధి.. ఆర్థిక ఇబ్బందులు.. భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (13:47 IST)
దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన భార్యను కట్టుకున్న భర్త చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా పొన్నురు మండలం కసుకర్రు గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన తుమ్మంపాటి చిన్న సుబ్బయ్య (50), తుమ్మంపాటి రోజా (45) అనే దంపతులు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఈ దంపతులిద్దరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. 
 
అదేసమయంలో వైద్యం చేయించుకునేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేకుండాపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నసుబ్బయ్య.. భార్య రోజాను తలపై కర్రతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఈ దంపతులు తెల్లవారినప్పటికీ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా దంపతులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు నమోదు చేసిన పొన్నూరు గ్రామీణ పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments